MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన సబ్బని సంతోష్ (40) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. 15 రోజుల క్రితం తల్లి భాగ్యమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఇవాళ భార్య పుష్పలత, సోదరి మంజులను మేనమామ ఇంటికి పంపాడు. ఈ క్రమంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సంతోష్ తల్లి మరణం తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.