కోనసీమ: రామచంద్రపురంలో అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులకు బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 25,000 ఆర్థిక సహాయం అందించి పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి సామాజిక బాధ్యతగా తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తానన్నారు.