యుద్ధం నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం పెరుగుదలని ‘హెడ్లైన్ రిస్క్ వోలాటిలిటీ’గా నిపుణులు నవీన్ అభివర్ణించారు. భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయని.. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారని డాక్టర్ రెనిషా అభిప్రాయపడ్డారు.