TPT: సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మత్స్యకారుల సమస్యలపై సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పులికాట్ సరస్సులో తమిళనాడు బోట్ల అక్రమ ప్రవేశం వల్ల స్థానిక మత్స్యకారులు నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు.