CTR: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని బైరెడ్డిపల్లి ఎస్సై చందన ప్రియ హెచ్చరించారు. మండలంలోని కమ్మనపల్లి కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు బుధవారం పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాను మంచి కోసమే ఉపయోగించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు.