ASR: కొయ్యూరు మండలంలో 7,436 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్దిదారులకు గాను రూ.3,12,01,500 సొమ్ము మంజూరైనట్లు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు బుధవారం తెలిపారు. ఈనెల 31వ తేదీన పెన్షన్ సొమ్మును బ్యాంకుల నుంచి విత్ డ్రా చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచి లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించారు.