SRPT: వాహనదారులు అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలని ఎస్సై క్రాంతికుమార్ అన్నారు. బుధవారం తుంగతుర్తిలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలని, రోడ్డు నియమ నిబంధనలను పాటించాలన్నారు.