KMR: రామారెడ్డి మండలం గోకుల్ తండా ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించినట్లు పాఠశాల హెచ్ఎం ఖదీర్ తెలిపారు. ఇటీవల పాఠశాలకు చెందిన పదిమంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా తొమ్మిది మంది విద్యార్థులు ఎంపికైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.