ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నస్వామి స్టేడియంలో ఇకపై ఎటువంటి ఫిజికల్ టిక్కెట్లను అనుమతించబోమని తెలిపారు. కేవలం డిజిటల్ QR కోడ్ టిక్కెట్లను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. టిక్కెట్ల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.