W.G. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో నారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన భౌతిక శాస్త్రం పరీక్షకు 23,536 మంది విద్యార్థులకు గాను 23,005 మంది హాజరయ్యారు. 531 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఓపెన్ స్కూల్ సాంఘిక శాస్త్రం పరీక్షకు 221 మంది హాజరుకాగా, 41 మంది రాలేదని పేర్కొన్నారు.