TG: తానేం తప్పుగా మాట్లాడలేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టారని.. ఇప్పసారా తయారు చేస్తే ఇందిరమ్మ పేరు పెట్టొద్దని.. ఆమె అంటే తమకు గౌరవమని అన్నారు. ఇప్పుడు కూడా ఇందిరమ్మను అవమానించలేదన్నారు. క్షమాపణ చెప్పాల్సి వస్తే చెబుతానన్నారు. కావాలనే మంత్రులు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.