WG: పెనుమంట్రలో 221 ఏళ్ల పురాతన శ్రీరామాలయంలో బుధవారం ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొనేందుకు పెనుమంట్ర, బ్రాహ్మణచెరువు, గరువు, నత్తరామేశ్వరం, జుత్తిగ తదితర పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.