NRML: కడెం మండలంలో వీర హనుమాన్ విజయ యాత్ర వైభవోపేతంగా కొనసాగింది. ఈ వీ హెచ్పీ, భజరంగ్ ధల్ ఆధ్వర్యంలో మండలంలోని పాండ్వాపూర్ నుంచి పెద్దుర్ వరకు రాముడి ప్రతిమ, హనుమాన్ ప్రతిమతో భారీ ర్యాలీ కొనసాగింది. ముందుగా ప్రతిమలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జై శ్రీ రాం అంటూ భక్తులు నినాదాలు చేశారు.