సత్యసాయి: లేపాక్షిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ భూమి పూజ చేశారు. ఆధునిక సౌకర్యాలతో భవనం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయని చెప్పారు. CSR నిధులతో సహకరించిన బాలాజీని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.