TPT: నాగలాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణిగా మూడి శ్రీతేజస్విని బధవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 ద్వారా ఎంపికై నాగలాపురం మండలంలో మొదటిసారిగా ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు. కార్యాలయ సిబ్బంది ఆమెకు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు.