MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నిన్న విడుదలైన గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. ఈ సంవత్సరం పరీక్షలకు హాజరైన 25 మంది విద్యార్థులకు గాను 25 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాకూబ్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.