ADB: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆపేది లేదని BRS పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగు కృష్ణారెడ్డి అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమై మాట్లాడారు. రైతు రుణమాఫీ, పెన్షన్, ప్రతి మహిళకు నెలకు 2500 చెల్లింపు వంటి పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.