MHBD: ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు కామ్రేడ్ కుంజ రాము 22వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు సువర్ణపాక వెంకటరత్నం కోరారు. ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్తగూడ(M)మోకాళ్ళపల్లి గ్రామంలో మార్చి 27న నిర్వహించనున్న వర్ధంతి సభకు ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన నివాళులర్పించాలని కోరారు.