KDP: ప్రొద్దుటూరులోని పౌరసరఫరాల శాఖ బియ్యం గోడౌన్పై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన బియ్యాన్ని ముందుగానే నల్లబజార్కు తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. స్టేజ్-2 కాంట్రాక్టర్, గోడౌన్ అధికారుల ప్రమేయంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తునట్లు తెలిపారు. ప్రతినెల భారీ స్థాయిలో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.