VKB: బంట్వారం మండలంలోని మద్వాపూర్ నుంచి బుగ్గాపూర్ వెళ్లే మట్టి రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకాన్ని చూపుతోంది. వర్షాకాలంలో ఈ దారిలో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, లేనిపక్షంలో రోడ్డుపైనే ధర్నా నిర్వహిస్తామని స్థానికులు హెచ్చరించారు.