JGL: కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప స్వామి సన్నిధిలో మాజీ మంత్రి, ధర్మపురి BRS పార్టీ ఇంచార్జ్ కొప్పుల ఈశ్వర్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు. వారు మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నారు.