కూతురిపై తల్లే తన ప్రియుడితో అత్యాచారం చేయించింది. ఈ ఘటన చెన్నైలోని సాలిగ్రామంలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లికి అది తప్పు అని చెప్పిన కూతురు.. ఆ తర్వాత మాట్లాడటం మానేసింది. అయితే బాలికకు జ్వరం రాగా.. మాత్రలని చెప్పి నిద్రమాత్రలిచ్చి తన ప్రియునితో అత్యాచారం చేయించింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. పోలీసులు తల్లిని, ప్రియుడిని అరెస్ట్ చేశారు.