NTR: కామ్రేడ్ గుంటూరు బాపనయ్య 49వ వర్ధంతిని విస్సన్నపేటలో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కెవీపీఎస్ జిల్లా నాయకుడు జ్ఞాన రత్నం నివాళులర్పించారు. గుంటూరు బాపనయ్య కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతంలో కష్టజీవుల కోసం విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశారు. దున్నే వాడికే భూమి కావాలని జమీందారులను ఎదిరించారన్నారు.