NLR: బుచ్చి (M) పెనుబల్లి గ్రామంలో తాహాసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ధాన్యం మద్దతు ధరలను గురించి ఆయన రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కేంద్రాలలో అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.