NRML: ప్రజల న్యాయ సమస్యలకు త్వరిత పరిష్కారం కోసం ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, సివిల్ వివాదాలు వంటి అంశాలు తక్కువ ఖర్చుతో త్వరగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. రాజీ మార్గమే రాజ మార్గం అంటూ కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.