నల్గొండ: శ్రీరామనవమి వేడుకల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఆలయాలకు విద్యుత్ అలంకరణలు చేయాలని, భక్తులకు మంచినీరు, టెంట్లు, పారిశుద్ధ్య వసతులు కల్పించాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాదినేని శ్రీనివాసరావు, బంటు సైదులు, రేపాల పురుషోత్తం రెడ్డి ఉన్నారు.