కోనసీమ: ముంజవరం వద్ద వైనతేయ గోదావరి నదిలో త్రిమూర్తులు(55) అనే వ్యక్తి గల్లంతైనట్టు వీఆర్వో కే. దొరబాబు మంగళవారం రాత్రి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలే నికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారని, స్థానిక రామాలయం వద్ద ఉన్న పుష్కర ఘాట్ చెంతన సైకిల్, చెప్పులు, చరవాణి విడిచి పెట్టి గోదావరిలో గల్లంతైనట్టు ఆయన తెలిపారు.