TG: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సాయంత్రం భేటీ కానున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అంశాలపై సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో చర్చించనున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆర్టీసీ సమస్యలను లిఖితపూర్వకంగా తీసుకురావాలని పొన్నం కోరారు.