AP: మంగళగిరి పట్టణం కొప్పురావుకాలనీలో నూతనంగా రామాలయ పునఃప్రతిష్ట మహోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య హనుమత్ లక్ష్మణ సీతాసమేత రాముల వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేవాలయం పునర్నిర్మాణానికి మంత్రి లోకేష్ రూ.5 లక్షల విరాళం అందించారు.