ఏలూరులోని బెనర్జీపేటలో తాళంవేసి ఉన్న ఇంట్లో దుండగులు చొరబడి వెండి ఆభరణాలను అపహరించారు. పోలీసుల వివరాలు.. స్థానిక నివాసి రాజావెంకటమురళీకృష్ణ తన కుటుంబంతో ఈ నెల 11న తీర్థయాత్రలకు వెళ్లాడు. యాత్ర ముగించుకుని 23న తిరిగి ఇంటికి వచ్చి చూడగా, బీరువా తెరిచి ఉంది. అందులోని సుమారు 250 గ్రాముల వెండి ఆభరణాలు మాయమైనట్లు గుర్తించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.