PLD: ఈపూరు ఏపీ మోడల్ స్కూల్ నూతన భవన నిర్మాణ పనులు మూలనపడ్డాయి. 2020లో రూ. 5 కోట్లతో వనికుంట వద్ద పనులు ప్రారంభించినా, ప్రస్తుతం అవి మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో సొంత భవనం లేక సుమారు 400 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేసుకునే సౌకర్యం లేక చదువుకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.