E.G: రాజానగరం నియోజకవర్గంలో MLA బత్తుల బలరామకృష్ణ కృషితో 256 ఎకరాల భూమిని 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు, రుణాలకు ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చిందన్నారు. భూములపై పూర్తి హక్కులు లభించాయని, మిగిలిన సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని MLA ఈ సందర్భంగా స్పష్టం చేశారు.