CTR: కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మకు 2.48 కేజీల కొత్త వెండితో పూర్ణ హారతి చేయించినట్లు ఆలయ ఛైర్మన్ BMK రవి చంద్రబాబు తెలిపారు. తమిళనాడులోని హోసూరు GRTలో రూ.5,44,800 విలువచేసే పూర్ణ హారతిని చేయించి అమ్మవారి జాతరకు తీసుకురావడం జరుగుతుందన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి భక్తులు ఎంతగానో సహకరిస్తున్నారని వారి సహకారంతోనే పూర్ణ హారతి చేయించడం జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు.