BHNG: మోత్కూరు స్మశాన వాటికలో కనీస వసతులు లేవని బందెల శ్రీను ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. దహన సంస్కారాలకు రాత్రి వేళలో వీధి దీపాలు లేక, మహిళల స్నానాలకు నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. కోటి నిధులు మంజూరైనా అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయని మండిపడ్డారు.