T20 WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో భారత్ ఓటమి అంచున నిలిచింది. ప్రొటీస్ విసిరిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. తొలి నుంచి బ్యాటర్లు తడబడ్డారు. ఈ క్రమంలో మహారాజ్ వేసిన 15 ఓవర్లో హార్దిక్(18), రింకూ(0), ఆర్ష్దీప్(10) వెంటవెంటనే వెనుదిరిగారు. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి స్కోర్ 88/8 కాగా దూబే(19), వరుణ్(0) క్రీజులో ఉన్నారు.