AKP: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా పరవాడ, వాడ చీపురుపల్లి పీహెచ్సీలు సంయుక్తంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ కనక అప్పారావు మాట్లాడుతూ.. టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల కలిగే ప్రాణాంతక అంటువ్యాధి అని తెలిపారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.