MHBD: జిల్లా కేంద్రంలోని పలు మండలాలలో ఇవాళ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో బయ్యారం మండలం బీరోనిమాడువల గ్రామంలో గాలివానతో రైతుల మొక్కజొన్న పంట నేలవాలింది. చేతికొచ్చే దశలో ఉన్న పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు తమను నష్టపరిచాయని, నష్టపోయిన పంటకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.