SRD: సంగారెడ్డిలోని శ్రీ రామ మందిరంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికను కలెక్టర్ ప్రావీణ్యకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ వనిత, కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్, శ్రీరామ మందిరం యువసేన అధ్యక్షుడు శ్రీనివాస్ రాజ్, సభ్యులు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.