TPT: కోట మండలం విద్యానగర్ గ్రామంలో నేడు ‘అన్నదాత సుఖీభవ-రైతన్న మీ కోసం’ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గూడూరు MLA పాశం సునీల్ కుమార్ పాల్గొంటారని స్థానిక నేతలు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోట మండల రైతు అధ్యక్షుడు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.