E.G: జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో గురువారం 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్.మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతిని సమీక్షించారు. కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.