ASR: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, సానుకూల స్పందనపై దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గురువారం ఐటీడీఏలో అధికారులతో సమావేశమయ్యారు. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల పనితీరుపై దృష్టి సారించాలన్నారు