SKLM: ఆమదాలవలసలోని పలు ప్రాంతాలలో గురువారం సాయంత్రం వడగళ్లతో వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పూజారిపేటలోని పలు వీధుల్లో ఉన్న కాలువల్లో పూడికలు పేరుకుపోవడంతో కాలువలో ఉండే మురికి నీరు రోడ్ల పై ప్రవహిస్తుంది. దీంతో స్థానికులు వాహనదారులు, తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి కాలువల్లో పూడికలు తీయాలని ప్రజలు కోరుతున్నారు.