VSP: పెదవాల్తేరు ప్రాంతంలోని శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 21 వరకు జరిగే జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. క్యూలైన్, ట్రాఫిక్ నియంత్రణ, జీవీఎంసీ శానిటేషన్, నిరంతర విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలన్నారు.