JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తుల రద్దీ కొనసాగింది. ఈ సందర్భంగా సోమవారం టికెట్ల ద్వారా రూ.1,35,066, ప్రసాదాల ద్వారా రూ. 90,720, అన్నదానం ద్వారా రూ. 24,165 ఆదాయం లభించింది. మొత్తం కలిపి రూ. 2,49,951 వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకుని స్వామివారికి సేవలు సమర్పించారు.