T20 WC విజయం తర్వాత భారత క్రికెటర్లు ఆలయాలను సందర్శించడంపై SMలో వస్తున్న విమర్శలపై అక్షర్ పటేల్ స్పందించాడు. మైదానంలో పోరాడి గెలిచినప్పుడు, ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ మొక్కులు తీర్చుకోవడంలో తప్పేముందని ప్రశ్నించాడు. ‘విజయం దక్కినప్పుడు గుడికి వెళ్లడం ఒక మంచి పద్ధతి, అది మా వ్యక్తిగత విశ్వాసం’ అని అక్షర్ పేర్కొన్నాడు.