GDWL: జిల్లాలో 2025-26 యాసంగి (రబీ) ధాన్యం సేకరణను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులు ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దీనికి అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.