కాకినాడ జిల్లాలో 100% పంచాయతీ పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం రూ. 98 కోట్లలో, వోఎన్జీసీకి చెందిన రూ. 17 కోట్ల వివాదం కోర్టులో ఉండగా, మిగిలిన రూ. 81 కోట్లలో ఇప్పటివరకు రూ.56. 58 కోట్లు(66.5%) వసూలైనట్లు ఇంఛార్జ్ DPO లక్ష్మణరావు సోమవారం తెలిపారు. మిగిలిన బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సాధిస్తామని చెప్పుకొచ్చారు.