కోనసీమ: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు అన్నారు. ఆయన అల్లవరం మండలంలోని ఎంట్రీ కోన గ్రామంలో స్థానిక నాయకులు నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.