అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వం బీసీల సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్ 11న BCY పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇవాళ మదనపల్లె సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా BCY పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.