GDWL: భారత్-అమెరికా వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం గద్వాల మండలం చెనుగోనిపల్లిలో రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 29 కార్మిక చట్టాలను పూర్తిగా తొలగించాలన్నారు. విత్తన బిల్లును అమలు చేస్తే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.